స్టాక్‌ మార్కెట్‌లో అస్థిరత

Daily Share Market Updates In Telugu  - Sakshi

ముంబై : అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిణామాలతో దేశీ స్టాక్‌ మార్కెట్‌లో అస్థిరత నెలకొంది. క్రితం రోజు భారీ లాభాలతో ముగిసిన మార్కెట్‌ ఈ రోజు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతోంది. ఉదయం పది గంటల సమయానికి 10 గంటల సమయానికి బీఎస్‌సీ సెన్సెక్స్‌ 12 పాయింట్లు నష్టపోయి 58,992 పాయింట్ల దగ్గర ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17,562 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.

ఈ రోజు మార్కెట్‌లో టెక్‌ మహీంద్రా, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టైటాన్‌ కంపెనీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ , సన్‌ఫార్మా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతి షేర్లు లాభాలు పొందగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు ధర భారీగా నష్టపోయాయి. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌ ,టాటా స్టీల్‌, నెస్టల్‌ ఇండియా షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. 

చదవండి : స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల సంఖ్య 8 కోట్లు, ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టిన భారత్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top