అనిశ్చితులున్నా ఎగుమతులు మిన్న | concerns among Indian exporters is low to better revenue | Sakshi
Sakshi News home page

అనిశ్చితులున్నా ఎగుమతులు మిన్న

Mar 28 2025 7:37 AM | Updated on Mar 28 2025 10:42 AM

concerns among Indian exporters is low to better revenue

ప్రపంచ వాణిజ్యం, టారిఫ్‌లపై అనిశ్చితులున్నప్పటికీ రానున్న కాలంలో భారత్‌ నుంచి ఎగుమతులు వృద్ధి పథంలోనే సాగనున్నట్లు విదేశీ వాణిజ్య డైరెక్టర్‌ జనరల్‌ సంతోష్‌ కుమార్‌ సారంగి పేర్కొన్నారు. అయితే ఇందుకు ఎగుమతిదారులు వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకుని వ్యూహాత్మకంగా విచక్షణతో వ్యవహరించవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత వాతావరణం భారత్‌కు బంగారంలాంటి అవకాశాలను కల్పిస్తుందని తెలియజేశారు.

తయారీలో పోటీతత్వాన్ని పెంచుకోవడంతోపాటు.. ఎగుమతులు పుంజుకునేందుకు వైవిధ్యాన్ని చూపవలసి ఉంటుందని దేశీ ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్‌ఐఈవో) ఏర్పాటు చేసిన సోర్సెక్స్‌ ఇండియా 2025 షోలో సంతోష్‌ వివరించారు. చైనా తదితర దేశాలపై యూఎస్‌ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతీకార టారిఫ్‌లకు తెరతీసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 2 నుంచి వీటిని భారత్‌కు సైతం వర్తింపచేయనున్నారు. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న అమెరికా టారిఫ్‌ల విధింపు నేపథ్యంలో కొన్ని ఎగుమతి సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. యూఎస్‌కు ప్రధానంగా ఇంజినీరింగ్, ఫార్మా ఎగుమతులు దెబ్బతినవచ్చని కొన్ని కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్నాయి.

ఇదీ చదవండి: భాగ్యనగరంలో రియల్టీ ఎలా ఉందంటే..

ప్రస్తుత ఏడాదిలో భారత్‌ వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్‌ డాలర్లను దాటనున్నట్లు సంతోష్‌ పేర్కొన్నారు. గతేడాది ఇవి 778 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు తెలియజేశారు. ఇటీవల కొద్ది నెలలుగా ఎగుమతుల్లో మందగమనం నెలకొన్నప్పటికీ దీర్ఘకాలంలో పుంజుకోగలవని అభిప్రాయపడ్డారు. ఆర్డర్లపై పెరుగుతున్న విచారణలు సానుకూల అంచనాలకు దారి చూపుతున్నట్లు తెలియజేశారు. వెరసి భవిష్యత్‌లో ఎగుమతులు వృద్ధి బాటలో సాగగలవని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement