చక్కెర ఉత్పత్తులపై 50 శాతం సుంకం.. కారణం తెలుసా.. | 50 Percentage Export Duty On Molasses | Sakshi
Sakshi News home page

చక్కెర ఉత్పత్తులపై 50 శాతం సుంకం.. కారణం తెలుసా..

Jan 19 2024 11:22 AM | Updated on Jan 19 2024 11:23 AM

50 Percentage Export Duty On Molasses - Sakshi

ప్రస్తుత సీజన్‌‌లో చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో చెరకు నుంచి తీసే ఇథనాల్ ఉత్పత్తికి కీలకమైన మొలాసిస్‌‌పై ప్రభుత్వం 50 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. ఈ నిబంధనలు జనవరి 18 నుంచి అమలులోకి వచ్చాయి. దేశీయ డిస్టిలరీల కోసం మొలాసిస్‌ను అందుబాటులో ఉంచడం, పెట్రోల్‌, డీజిల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుత సంవత్సరంలో పెట్రోల్‌‌లో 15 శాతం ఇథనాల్‌‌ను కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇథనాల్ మళ్లింపు లేకపోవడం వల్ల 2023-24 సీజన్‌‌లో (అక్టోబర్-సెప్టెంబర్) చక్కెర ఉత్పత్తి  37.3 మిలియన్ టన్నుల నుంచి 32.3-33 మిలియన్ టన్నులకు పడిపోయిందని ప్రభుత్వం తలిపింది.

ఇదీ చదవండి: రూపాయి కంటే తక్కువ విలువైన కరెన్సీలు ఇవే..

వియత్నాం, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్  ఫిలిప్పీన్స్‌‌తో సహా ఇతర దేశాలకు భారతదేశం మొలాసిస్‌‌ను ఎగుమతి చేస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్  రాష్ట్రాలు మొలాసిస్‌‌ను ఎగుమతి చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement