ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్‌: తొలిరోజే 1.4 లక్షల కొనుగోళ్లు | 1 4 Lakh Users Buy New FASTag Annual Pass On Day One in India | Sakshi
Sakshi News home page

ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్‌: తొలిరోజే 1.4 లక్షల కొనుగోళ్లు

Aug 16 2025 1:34 PM | Updated on Aug 16 2025 1:40 PM

1 4 Lakh Users Buy New FASTag Annual Pass On Day One in India

ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్‌' (FASTag Annual Pass) ప్రారంభమైంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు & ఎక్స్‌ప్రెస్‌వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాలలో దీనిని అమలు చేసింది.

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. యాన్యువల్ పాస్‌కు జాతీయ రహదారి వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఆగస్టు 15న అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్‌ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. అంతే కాకుండా టోల్ ప్లాజాలలో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి.

జాతీయ రహదారి వినియోగదారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండే.. ఈ ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్‌ ఒక సంవత్సరం లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్‌లకు (ఏది ముందు అయితే అది) అనుమతిస్తుంది. దీనికోసం రూ. 3000 వన్ టైమ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌ ద్వారా లేదా ఎన్‌హెచ్‌ఏఐ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫీజు చెల్లిస్తే.. రెండు గంటల్లోపు యాక్టివేట్ అవుతుంది. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్యాగ్‌ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement