అడవి బిడ్డల
అభ్యున్నతికి కృషి
ఓటరు జాబితాలో మృతుల పేర్లు కూడా ఉన్నట్లు క్షేత్రస్థాయిలో చేపట్టిన ‘సర్’ సర్వేలో వెల్లడవుతున్నాయి.
అటవీ సంపదను పరిరక్షణతో కూడిన ఆదివాసీల జీవన విధానం అందరికీ ఆదర్శమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. గిరిజన భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి ఐటీడీఏ ద్వారా విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంత చట్టాలను పరిరక్షిస్తూ గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు ఐటీడీఓ పీఓ తెలిపారు. ఉద్దీపకం వర్క్బుక్లతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం మెరుగుపరుస్తున్నామని, ఉన్నత విద్య చదివి విద్యార్థులకు ల్యాప్టాప్లు, రూ.50 వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. కోయ భాష అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గిరిజన గట్టు, గోత్రాలు, కట్టుబాట్లు, ఇలవేల్పుల చరిత్రను పుస్తక రూపంలో తీసుకొచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్రాజ్, డీడీ చందన, ఆర్సీఓ అరుణకుమారి, ఇతర అధికారులు రాంబాబు, సమ్మయ్య, ఉదయ్కుమార్, పవర్ వేణు, ప్రభాకర్రావు, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, సర్పంచ్ పూనెం కృష్ణ, ఆదివాసీ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


