
స్పీడ్ బోట్లో షికారు ఎలా..?
పాల్వంచరూరల్ : కిన్నెరసాని జలాశయంలో స్పీడ్ బోట్లో షికారు చేసేందుకు ఎక్కువ మంది పర్యాటకులు అసక్తి చూపుతారు. కానీ నాలుగైదు రోజులుగా ఈ బోట్ పనిచేయకపోగా, మరమ్మతులపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. దీంతో పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు. తద్వారా పర్యాటకాభివృద్ధి సంస్థ ఆదాయం కూడా తగ్గింది. మామూలు రోజుల్లో పర్యాటకుల సంఖ్య కొంత తక్కువగా ఉన్నా.. ఆదివారం, సెలవురోజుల్లో మాత్రం రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివస్తుంటారు. ప్రస్తుతం విద్యాసంస్థలకు వేసవి సెలవులు రాగా, సందర్శకుల సంఖ్య కూడా పెరిగింది. ఈ సమయంలోనే స్పీడ్ బోట్ రిపేర్కు రావడంతో ఆదాయానికి గండి పడినట్టయింది. పెద్ద బోట్ ఒకటే నడవడంతో గత ఆదివారం రూ.6,270 ఆదాయం మాత్రమే లభించింది. అదే స్పీడ్ బోట్ కూడా నడిస్తే.... మేర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పెద్ద బోట్లో 20 మంది వరకు ఎక్కే అవకాశం ఉండగా ఒక్కొక్కరికి రూ.50 చొప్పున వసూలు చేస్తారు. అదే స్పీడ్ బోట్ ఆరుగురికే పరిమితమైనా.. ఒక్కో ట్రిప్నకు రూ.350 చార్జీ వసూలు చేస్తారు. ఇది వేగంగా జలాశయాన్ని చుట్టిరావడం, ఒక కుటుంబానికి చెందిన వారుంటే దీన్నే ఎక్కువగా ఇష్టపడతారు. కాగా, ఈ బోట్ను హైదరాబాద్లోని టూరిజం డెవలప్మెంట్ ప్రధాన కార్యాలయానికి పంపితే తప్ప రిపేర్ చేసే అవకాశం లేదు. కిన్నెరసాని నుంచి కార్గో పాయింట్కు, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించాలంటే రూ.1500కు పైగా ఖర్చవుతుంది. బోట్ ఇంజన్ తరచూ మరమ్మతులకు గురవుతండగా రవాణా ఖర్చులే అధికమవుతున్నాయి. పైగా సమయం కూడా ఎక్కువవుతోంది. దీంతో పర్యాటక శాఖ అధికారులు స్పందించి స్థానికంగానే మెకానిక్ను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
మరమ్మతులకు నోచుకోని వైనం