టీచర్‌గా మారిన డీఈఓ | - | Sakshi
Sakshi News home page

Feb 26 2023 12:50 AM | Updated on Feb 26 2023 5:09 AM

గణితం బోధిస్తున్న డీఈఓ సోమశేఖరశర్మ  - Sakshi

గణితం బోధిస్తున్న డీఈఓ సోమశేఖరశర్మ

అశ్వారావుపేటరూరల్‌: ఆయన జిల్లా విద్యాశాఖాధికారి.. అయినప్పటికీ కొద్ది సేపు విద్యార్థులకు పాఠాలు బోధించి టీచర్‌గా మారిపోయారు. అశ్వారావుపేటలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను శనివారం డీఈఓ సోమశేఖరశర్మ ఆకస్మికంగా సందర్శించారు. పదోవ తరగతి విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి పలు పాఠ్యాంశాలపై ప్రశ్నించారు. ఆ తర్వాత తానే టీచర్‌గా మారిపోయి బ్లాక్‌ బోర్డుపై విద్యార్థులకు గణిత బోధన చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. కష్టపడి, ఇష్టంగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. అనంతరం మన ఊరు – మన బడి పనులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి వంటకాలను రుచి చూశారు. ఆయనతోపాటు ఎంఈఓ పి.కృష్ణయ్య, పరీక్షల విభాగం ఏసీజీఈ మాధవరావు, సెక్టోరియల్‌ అధికారులు నాగరాజశేఖర్‌, సతీశ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement