ఈ చారిత్రక స్టేషన్ను ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి తన నిరంతర కృషితో ‘అమృత్ భారత్’ స్కీం కింద చేర్పించి, ఏకంగా రూ.28.51 కోట్ల భారీ నిధులు మంజూరు చేయించారు. దీంతో ప్రయాణికులను ఆకర్షించేలా అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించి స్టేషన్కు సరికొత్త లుక్ తీసుకువచ్చారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపి దేశ రాజధానికి వెళ్లే ఢిల్లీ రైలు హాల్టింగ్తో పాటు పలు రైళ్ల నిలుపుదలను సాకారం చేశారు. అలాగే సబ్వే నిర్మాణం కొరకు గత బడ్జెట్లో రూ.2 కోట్లు కేటాయించేలా ఎంపీ కృషి చేశారు.


