ఈమె పేరు అనూరాధ. మదనపల్లి పట్టణం అమ్మచెరువు మిట్ట. 15 ఏళ్లఽ క్రితం పక్షవాతంతో నోటి మాట పడిపోయింది. కాలు చెయ్యి కూడా కదపలేదు. మంచానికే పరిమితం. సొంత ఇళ్లు కూడా లేదు. వికలాంగుల ఫించన్ ఆరువేలు వస్తోంది. ఎలాంటి ఆధారం లేదు. బాడుగ ఇంటిలో కాపురం. ముగ్గురు పిల్లలు. భర్త కూలిపనులకు వెళతాడు. మంచానికే పరిమితమైన ఈమెకు ఆర్థిక భరొసా కల్పించడంతో పాటు పక్కా ఇంటిని మంజూరు చేయడం, రూ. 15 వేల డీఎంఅండ్హెచ్ఓ పింఛన్ ఇప్పించాలని మూడు చక్రాల బండిలో తెలిసినవారి సాయంతో వచ్చి జాయింట్ కలెక్టర్ను పీజీఆర్ఎస్లో కోరారు.


