సోషల్‌ మీడియాకు అండగా ‘వైఎస్సార్‌సీపీ’ ప్రత్యేక బృందాలు | YSRCP special teams for social media | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాకు అండగా ‘వైఎస్సార్‌సీపీ’ ప్రత్యేక బృందాలు

Nov 15 2024 5:34 AM | Updated on Nov 15 2024 7:27 AM

YSRCP special teams for social media

సాక్షి,అమరావతి: సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా నిల్చేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 

అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్‌ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పార్టీ తరపున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 

సోషల్‌ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఈ బృందాలు పనిచే­స్తాయి. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నా­యకులు, లీగల్‌సెల్‌ ప్రతినిధులను సమన్వ­యం చేసుకుంటూ ఈ బృందాలు పనిచేస్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement