స్టార్‌ హోటళ్ల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం | YSRCP Bhumana Karunakar Reddy fires on Chandrababu | Sakshi
Sakshi News home page

స్టార్‌ హోటళ్ల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం

Aug 23 2026 5:03 AM | Updated on Aug 23 2026 5:03 AM

YSRCP Bhumana Karunakar Reddy fires on Chandrababu

వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం

ఉచిత విద్యుత్, యూడీఎస్, జీఎస్టీ తదితర రాయితీలు ఎలా ఇస్తారు?

రూ.వందల కోట్ల కమీషన్‌ కోసం చంద్రబాబు, లోకేశ్‌ బరితెగింపు

తిరుపతి మంగళం: తిరుపతి, తిరుచానూరు ప్రాంతాల్లో స్టార్‌ హోటళ్ల నిర్మాణం పేరుతో చంద్రబాబు, లోకేశ్‌ ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడుతు­న్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శని­వారం ఆయన మీడియాతో మా­ట్లాడారు. ఈ నెల 20న కూటమి ప్రభుత్వం రెడిసన్‌ బ్లూ (ఫైవ్‌ స్టార్‌), సీఆర్‌ఆర్‌ హాస్పిటాలిటీ (ఫైవ్‌ స్టార్‌), ఎసెన్షియల్‌ (త్రీ స్టార్‌) హోటళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందన్నారు. 

9 నెలల క్రితమే ఏర్పడిన సీఆర్‌ఆర్‌ హాస్పి­టా­లిటీకి తిరుచానూరు సమీపంలోని దామినేడులో 1.71 ఎక­రాల ప్రైవేట్‌ స్థలంలో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నిర్మా­ణాని­కి అనుమతులు,ఐదేళ్ల ఉచిత విద్యుత్, యూ­డీ­ఎస్, జీఎస్టీ తదితర రాయితీలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. ఆ సంస్థకు హోటల్‌ రంగంలో అనుభవం, ప్రముఖ సంస్థ­లతో ఒప్పందాలు లేవని చె­ప్పారు. అనుమ­తు­ల వెనకున్న వ్యక్తులను బయట పె­ట్టాల­ని డి­మాండ్‌ చేశారు.

ఇప్పటికే తిరుచానూరు సమీ­పంలో 21ఎకరాల టూరిజం భూమిని ఎకరాకు రూ.­­90 ల­క్ష­ల చొప్పున 2 సంస్థలకు కేటాయించా­రని, ప్రభుత్వ విలువ ఎకరాకు రూ.4.5 కోట్లు ఉన్న­ప్ప­టికీ, తక్కువ ధరకే అప్పగించారన్నారు. రూ.వందల కోట్ల కమీషన్ల కోసం చంద్రబాబు, లో­కేశ్‌ బరి­తెగించి, ఇష్టానుసారంగా అనుమతులివ్వడందారు­ణ­మన్నారు. స్టార్‌ హోటళ్ల పేరుతో భూ కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, వాటిపై వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement