తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక గీతమైన "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" రచించిన మహాకవి శంకరంబాడి సుందరాచారి జయంతి సందర్బంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతంతో తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటిన రచయిత, మహాకవి అంటూ వైఎస్ జగన్ ప్రశంసించారు.
తెలుగు సంస్కృతి వైభవాన్ని అక్షరాల్లో అజరామరం చేసిన మహాకవి శంకరబాడి సుందరాచారి అని, తెలుగు నేల గొప్పతనాన్ని, తెలుగు తల్లి కీర్తిని తన కలంతో తరతరాలకు చాటి చెప్పారన్నారు. శంకరంబాడి సుందరాచారి సాహితీ సేవలు చిరస్మరణీయమన్నారు.
``మా తెలుగు తల్లికి మల్లెపూదండ`` గీతంతో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, సంస్కృతి వైభవాన్ని అక్షరాల్లో అజరామరం చేసిన మహాకవి శంకరంబాడి సుందరాచారి గారు. తెలుగు నేల గొప్పతనాన్ని, తెలుగు తల్లి కీర్తిని తన కలంతో తరతరాలకు చాటిచెప్పిన ఆయన సాహితీ సేవలు చిరస్మరణీయం. శంకరంబాడి సుందరాచారి గారి… pic.twitter.com/zKzBsJneq6
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 10, 2026


