అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా.. వైఎస్‌ జగన్‌ హర్షం | Ys Jagan Expressed Happiness Departure Of Shubhanshu Shukla To Space | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా.. వైఎస్‌ జగన్‌ హర్షం

Jun 25 2025 7:49 PM | Updated on Jun 25 2025 8:14 PM

Ys Jagan Expressed Happiness Departure Of Shubhanshu Shukla To Space

సాక్షి, తాడేపల్లి: అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బయల్దేరడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మన దేశం నుండి మొదటి వ్యోమగామి శుభాంశు శుక్లానే కావటం అందరూ గర్వించాల్సిన విషయం. శుక్లా సహా ఆయన టీమ్ ప్రయాణం సుఖవంతం కావాలి. ఈ మిషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’  అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. ఇస్రో-నాసా సంయుక్త యాక్సియం-4 మిషన్‌ కోసం భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి బయల్దేరారు. ఆయన ఈ మిషన్‌కు పైలట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నాం కెనడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఫాల్కన్‌-9 రాకెట్‌ నలుగురు వ్యోమగాములతో బయల్దేరింది. సుమారు 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి శుక్లా నేతృత్వంలోని బృందం చేరుకోనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement