సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాతృమూర్తి మలిరెడ్డి నాగసుందర మణిమ్మ(89) మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మలిరెడ్డి నాగసుందర మణిమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ దుఃఖ సమయంలో వారికి ధైర్యం, ఆత్మస్థైర్యం కలగాలని ఆకాంక్షించారు.


