నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్‌ గవర్నెన్స్‌ | WhatsApp Governance In Andhra Pradesh From January 30th, Check More Details Inside | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్‌ గవర్నెన్స్‌

Jan 30 2025 4:26 AM | Updated on Jan 30 2025 11:47 AM

WhatsApp governance in Andhra Pradesh from January 30th

మొదటి దఫాలో పౌరులకు అందుబాటులోకి 161 సేవలు 

వాట్సాప్‌ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

సాక్షి, అమరావతి: ప్రజలు నేరుగా ఫోన్‌ ద్వారానే ధృవపత్రాలు అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి వాట్సాప్‌ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం గత ఏడాది అక్టోబర్‌ 22న మెటాతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం.. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను వాట్సాప్‌ ద్వారా అందించనుంది. వాట్సాప్‌ గవర్నెన్స్‌పై బుధవారం సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో అధికారులు ఈ మేరకు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. వాట్సాప్‌ ద్వారా సేవలు ఎలా పొందాలి, ఆప్షన్‌లు ఎలా ఎంచుకోవాలో వివరించారు. 

మొదటి విడతలో దేవదాయ, ఎనర్జీ, ఏపీఎస్‌ ఆరీ్టసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్‌ఎఫ్, మున్సిపల్‌ వంటి వివిధ శాఖల సేవలు అందుబాటులోకి తెస్తున్నారు. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తేనున్నారు. దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్‌ గవర్నెన్స్‌ను రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్నామని, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు తిరగాల్సిన అవసరం ఉండదని చంద్రబాబు అన్నారు. అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఫోరెన్సిక్, సైబర్‌ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎస్‌ కె.విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement