TTD-CM Jagan: సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి

TTD Invites CM YS Jagan Vontimitta kodandaRamaswamy Kalyanam - Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో నిర్వహించే శ్రీరామ నవమి ఉత్సవాలకు విచ్చేయాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలను టీటీడీ అధికారులు ఆహ్వానించారు.  ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈవో డాక్టర్‌ రమణ ప్రసాద్‌.. సీఎం జగన్‌ను శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఏప్రిల్‌ 15న జరగనున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను సీఎం జగన్‌కు అందజేశారు. వేద పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థ, ప్రసాదాలు అందించారు. కాగా 15 వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటలలోపు పున్నమి వెన్నెల్లో శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం జరగనుంది. టీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top