గుంజీలు తీయించిన ప్రిన్సిపల్‌.. 44 మంది విద్యార్థినులకు అస్వస్థత | Tribal Welfare Gurukul Hostel Girls Falls wIll after Principal Gives Punishment at Rampachodavaram | Sakshi
Sakshi News home page

గుంజీలు తీయించిన ప్రిన్సిపల్‌.. 44 మంది విద్యార్థినులకు అస్వస్థత

Sep 16 2024 6:56 PM | Updated on Sep 16 2024 8:14 PM

 Tribal Welfare Gurukul Hostel Girls Falls wIll after Principal Gives Punishment at Rampachodavaram

సాక్షి,అల్లూరి సీతారామరాజు జిల్లా : రంపచోడవరం గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో దారుణం జరిగింది. కళాశాల కర్కశత్వానికి 44 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రి పాలయ్యారు. వివిధ కారణాలతో విద్యార్థినులకు పనిష్‌మెంట్‌ ఇచ్చారు ఆ ప్రిన్సిపల్‌.

రెండు రోజుల పాటు కళాశాల విద్యార్థినులతో ఒక్కసారిగా 200 గుంజీలు తీయడం, వారితో పరుగులు తీయించడం చేయించారు. దీంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నడవలేని స్థితిలో ఉన్న విద్యార్థునులను నడవలేని స్థితిలో ఉన్న విద్యార్థుల్ని అత్యవసర చికిత్స కోసం రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు కళాశాల సిబ్బంది.

ప్రిన్సిపల్‌ కఠిన శిక్షకు నడవలేని విద్యార్థునులు నడవలేని స్థితిలో రంపచోడవం ఆస్పత్రికి వెళ్లారు. కొంతమంది విద్యార్థునులను ఆస్పత్రి లోపలికి ఎత్తుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు విద్యార్థులు. కళాశాల ప్రినిపల్‌ తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని, నిర్దాక్షణ్యంగా శిక్షలు విధిస్తున్నారని, అన్నం తిన్న వెంటనే పరుగులు పెట్టిస్తున్నారని విద్యార్థునులు వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement