breaking news
Gurukul Hostel
-
ఛీ..ఛీ.. ఇదేం తిండి!
-
హోం మంత్రి అనితకు చేదు అనుభవం
హోం మంత్రి వంగలపూడి అనితకు చేదు అనుభవం ఎదురైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి బాలికల గురుకుల హాస్టల్ 'సందర్శనకు వెళ్లిన ఆమెను సమస్యలు పలకరించాయి. హాస్టల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ పలువురు బాలికలు ఆమెకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఆమె చేసేది లేక అధికారులపై చిందులు తొక్కారు. హోం మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే ఆమె అక్కడి బాలికల గురుకుల హాస్టల్ను సందర్శించారు. ఆ టైంలో గురుకుల హాస్టల్స్ దుస్థితి వెలుగులోకి వచ్చింది. భోజనంతో పాటు మెయింటెనెన్స్ కూడా బాగా లేదంటూ విద్యార్థినిలు హోం మంత్రికి చెప్పారు. దీంతో ఆమె కాస్త అసహనానికి గురయ్యారు.‘‘43 మంది ఆడ పిల్లలు చదువుతున్న హాస్టల్ వద్ద కనీసం సీసీ కెమెరాలు లేవు. వార్డెన్ పిల్లల్ని వదిలేసి 5 గంటలకే వెళ్ళిపోయింది. సన్న బియ్యం ఇవ్వాలని చెప్పినా అమలు కావడం లేదు. నాణ్యమైన భోజనం అందడం లేదు. ఇద్దరు అధికారులను ఎత్తేస్తే అందరికీ బుద్ధి వస్తుంది అంటూ ఆమె అధికారులపై మండిపడ్డారు. -
బాలికా విద్యపై ఇంకా వివక్షా?
భారతదేశ వ్యాప్తంగా దళిత, బహుజన స్త్రీ విద్యపై తీవ్రమైన వివక్ష కొనసాగుతోంది. నిజానికి గురుకుల హాస్టల్స్లోనూ, జనరల్ హాస్టల్స్లోనూ విద్యార్థినులు నిరంతరం అనారోగ్యానికి గురి అవుతున్నారు. దీనికి కారణం పౌష్టికాహార లోపం, శుభ్రతగా ఉండే పరిస్థితుల లేమి, సరైన మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేకపోవడం. అందుకే పిల్లలు రక్త హీనతతో శక్తి లేక కళావిహీనంగా ఉంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరి సంరక్షణ విషయంలో సరైన బడ్జెట్ను రూపొందించ లేకపోతున్నాయి. వీరిపట్ల ఎంతో అశ్రద్ధ కనబడుతోంది. వార్డెన్స్ను శాశ్వతంగా నియమించకపోవడం, హాస్టల్స్కు సొంత భవనాలు లేకపోవడం, విద్యార్థినుల సంఖ్యకు తగినట్లుగా గదులు లేకపోవడం లాంటి ఎన్నో కారణాలు బాలికలకు మెరుగైన చదువును నిరాకరిస్తున్నాయి.తల్లిదండ్రులు వలస కూలీలుగా వెళ్తుండగా, ఇంట్లో ఆలనా పాలనా లేని జీవన వ్యవస్థలో దళిత బాలికలు ఎంతో సంక్షోభాన్ని అనుభవి స్తున్నారు. దీనికి తోడు ఉద్యోగుల దోపిడీ విధానాలు కూడా పిల్లల నోటికాడి కూడును దొంగిలించే పరిస్థితులు వచ్చాయి. ఇస్తున్న కొద్దిపాటి సామాన్లనే వార్డెన్లు పరిగ్రహించటం, రాత్రుళ్లు కనీసం గర్ల్స్ హాస్టల్స్లో కూడా వార్డెన్లు నిద్రించకపోవడం, విద్యార్థులను సొంత పనులకు వాడుకోవడం లాంటి ఎన్నో లొసుగులు ఉన్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు గన్మెన్ వెంట తిరుగుతూ ఉంటారు. బాలికల హాస్టల్స్కు కనీసం ఒక గార్డ్ కూడా కాపలా ఉండడు.సౌకర్యాలు కల్పించకూడదా?విద్యకు ఆహారం, వసతి ముఖ్యం. ప్రభుత్వం ప్రతి మూడు జిల్లాలకైనా ఒక స్పెషల్ కలెక్టర్ను వెయ్యాల్సి ఉంది. ఆయనకు కొన్ని టాస్క్ ఫోర్స్ టీములను అప్పగించాల్సి ఉంది. ఈ సంవత్సరం హాస్టళ్ళలో అత్యాచారాల సంఖ్య పెరిగింది. ప్రతి మహిళా పోలీస్ స్టేషన్కు ఆ ప్రాంతంలో వున్న బాలికల హాస్టల్ రక్షణ బాధ్యతను అప్ప గించాల్సి ఉంది. తెలంగాణలో ఎన్నిసార్లు గురుకుల విద్యార్థినులు కలుషిత ఆహారంతో ఆసుపత్రుల పాలయ్యారు? రెండు రాష్ట్రాల లోనూ నాసిరకం బియ్యాన్ని గురుకుల పాఠశాలలకు సరఫరా చేస్తు న్నారు. దీనికి కారణం వీళ్ళలో గూడుకుట్టుకున్న కులతత్వం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పథకం ఇస్తానని చెప్పి దళిత విద్యార్థుల్లో విద్య పెరుగుతుందనే ఆ పథకం మీద గొడ్డలివేటు వేశారు. అమరావతి నిర్మాణం, పోలవరం అనే పాట పాడుతూ, ప్రపంచ బ్యాంకుల నుండి అప్పులు తెస్తూ మహా నగరాన్ని నిర్మిస్తాననే మాటతో ఏపీ ముఖ్యమంత్రి ప్రజల్ని నమ్మి స్తున్నారు. దళిత బహుజన విద్యార్థుల్ని విద్యాశక్తికి పనికిరాకుండా మానసిక దౌర్భల్యానికి గురిచెయ్యాలనే పెద్ద ప్రయత్నం జరుగుతోంది. దళిత బహుజనుల జీవన వ్యవస్థల మీద దెబ్బ కొట్టాలనే ప్రయ త్నంతోనే ‘అమ్మఒడి’కి ‘తల్లి దీవెన’ అని పేరు పెట్టి దాన్ని నిర్వీర్యం చేయాలని రోజుకొక ప్రకటన చేస్తున్నారు. గిరిజనుల హాస్టళ్ళకు ఆహార, ఆహార్య, రక్షణలను కలిగించకుండా, తల్లిదండ్రులకు తమ పిల్లలను చదివించాలనే ఆసక్తిని పోగొడుతున్నారు. నిజానికి ఇది ఒక పద్ధతి ప్రకారమే అగ్రకులాధిపత్యం చేయిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇవ్వగలిగి కూడా ఇవ్వలేకపోవడా నికి కారణం ఏమిటి? తల్లిదండ్రులు వలస కూలీలుగా వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ఆటోలో 25 మంది వరకు ఎక్కి, ప్రమాదాల్లో చనిపోయి, పిల్లలు అనాథలవుతున్న స్థితి మనకు కనబడుతుంది. ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే బహుజన స్త్రీలలో మొబిలిటీ పెరుగుతుందనీ, వారు దూర ప్రాంత పనులకు వెళ్ళగలుగుతారనీ అంచనా వేసే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యాన్ని దాటవేస్తోంది.కుటుంబాల్లో సంక్షోభంఈ సందర్భంగా దళితవాడల పరిస్థితిని ఒకసారి చూద్దాం. రెండు రాష్ట్రాలలోని అన్ని జిల్లాలలో దళితవాడలు మురుగు నీరుతో, జబ్బులతో కునారిల్లుతున్నాయి. గ్రామ రాజ్యాన్ని పునరుద్ధరిస్తానంటున్న ఏపీ ఉపముఖ్యమంత్రి దళితవాడలకు ఇంతవరకు ఇళ్ళ స్థలాల విషయంగానీ, ఉపాధిని ఇచ్చే కుటీర పరిశ్రమల విషయంగానీ ఎత్తడం లేదు. దళిత వాడల్లో మద్యపానంతో పురుషులు ఎక్కువ మంది మరణిస్తూ స్త్రీలు విధవరాళ్లు అవుతున్నారు. గ్రామాలు సంక్షో భంలో, కుటుంబాలు వైరుధ్యాలతో కొట్టుమిట్టాడుతుంటే నోరు మెదపడం లేదు. దళిత బహుజన విద్యార్థినులు పేరెంట్స్ మీటింగ్కు పిలిస్తే సగంమంది విడిపోయిన భార్యాభర్తలు వస్తున్న విషయాలు వీరికి తెలిసి కూడా, ఈ కుటుంబ సంక్షోభం విద్యార్థుల భవిష్యత్తుపై గొడ్డలి వేటు అని తెలుసుకోలేకపోతున్నారు. రెండు రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య విపరీతంగా పెరగడం ఎంత బాధకరమో అర్థం చేసుకోలేకపోతున్నారు.ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా స్త్రీ ఆర్థికాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం జీవగర్ర. మగవాళ్లు తాగి జుట్టు పట్టుకొని ఆడవాళ్లను, ఆఖరికి తల్లిని కూడా కొట్టి ఇళ్ళల్లోంచి తరుముతున్న దారుణాలు చూస్తున్నాం. ఈ సామాజిక సంక్షోభాన్ని ప్రభుత్వం నివారించడానికి ప్రయత్నించడం లేదు. పైగా అనేక రకాల మత్తు పదార్థాలను విచ్చల విడిగా పాఠశాల పరిసర ప్రాంతాల్లోనూ, దళిత వాడల్లోనూ అమ్ముతూ ఉన్నా కూడా ప్రభుత్వాలు కళ్ళప్పగించి చూడటం ఆశ్చర్యం వేస్తుంది.ఫూలే ఆశయాలు మరిచారా?తెలంగాణలో అయితే అసెంబ్లీలో ప్రతిపక్షం హాస్టళ్లలోని దుర్భ రమైన పరిస్థితులను ఎత్తిచూపినా ప్రభుత్వం దాటవేసే చర్యలను చేస్తున్నదే తప్ప వాటిని నిజంగా నివారించే చర్యలు చేపట్టడం లేదు. అసలు హాస్టల్స్లో రగ్గులు పంచి, పిల్లలను చలి నుండి కాపాడాలనే ఉద్దేశం కూడా లేకుండా జీవిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం భారతదేశంలోనే దళిత బహు జన విద్యపైన గొడ్డలివేటు పడుతోంది. దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు కోట్లకు పడగలెత్తిన వారున్నారు. కనీసం తమ నియోజక వర్గాల్లో కూడా విద్యార్థులకు దుప్పట్లు పంచడం గానీ, శక్తిమంతమైన ఆహారాన్ని కల్పించడం కోసం పాలు, గుడ్లు, పండ్లు, పప్పులు వంటివి పంచిపెట్టడం గానీ చెయ్యడం లేదు. దీనికంతటికీ కారణం వీళ్లు స్వార్థ పూరితమైన జీవితంతో మహాత్మ ఫూలే జీవితానుసరణను, ఆయన సిద్ధాంతాలను, ఆశయాలను మరచిపోయి అగ్రవర్ణాలతో సంపాదనలో పోటీ పడటమే.మహాత్మా ఫూలే 1848లోనే బ్రిటిష్ ప్రభుత్వానికి బహుజన స్త్రీల మీదే కాక మొత్తం స్త్రీలకే విద్య రావాలనే విషయం మీద ఎన్నో ఉత్తరాలు రాశారు. అంబేడ్కర్ తన జీవితం మొత్తం దళిత బహు జనుల విద్యకోసం పోరాడారు. ఆనాడు ఎలాగైతే అగ్రవర్ణాల్లో దళిత బహుజనులు చదువుకోకూడదనే దురుద్దేశం ఉండిందో, అది ఇప్పటికీ కొనసాగుతోందని అర్థం అవుతోంది. ఒక పదవ తరగతి విద్యార్థిని ఏడు సబ్జెక్టులు చదవాలంటే, పాఠాలు వినాలంటే, పరీక్షలు రాయా లంటే ఎంత శక్తి కావాలి, ఎంత ఆహారం తినాలి అని ప్రభుత్వాలకు తెలియదా! మహాత్మా ఫూలే చెప్పినట్లు మన గ్రామాలను మనమే పునర్ నిర్మించుకునే సందర్భం వచ్చింది. అంబేడ్కర్, పెరియార్ రామ స్వామి నాయకర్ స్వీయ వ్యవస్థల ద్వారా విద్య సంస్కరణలను చేసు కోవాలనీ, విద్యా వ్యవస్థలను నిర్మించుకోవాలనీ చెప్పిన విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లల భవిష్యత్తుకు మనమే మార్గం వేసుకోవాలి. ముఖ్యంగా చర్చిల్లో కేవలం ప్రార్థనలే కాకుండా విద్యా బోధనలకు అవకాశం కల్పించాలని కోరాలి. దళిత బహుజన సామాజిక సంఘాలు, స్వీయ సామాజిక విద్యా పునర్జీవనం కోసం పాటుపడాలి. ఆత్మ గౌరవ పోరాటాలతోనే సమసమాజ నిర్మాణం సాధ్యం. విద్యే జీవన వ్యవస్థలకు సోపానం. విద్య మానవ వ్యక్తిత్వ వికాసానికి పునాది. విద్య మానవాభ్యుదయానికి నాంది. విద్యా పునాదుల మీదే నూత్న సమాజం రూపొందుతుంది. అందుకే అంబే డ్కర్ దళితులకు విద్యా విప్లవ నినాదాన్ని ఇచ్చారు. అందునా బాలికా విద్య సామాజిక భవితవ్యానికి వారధి. అంబేడ్కర్ మార్గంలో నడుద్దాం. నూత్న సమాజాన్ని నిర్మిద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
తెలంగాణలోని గురుకులల్లో సీఎం రేవంత్ తనిఖీలు
-
గుంజీలు తీయించిన ప్రిన్సిపల్.. 44 మంది విద్యార్థినులకు అస్వస్థత
సాక్షి,అల్లూరి సీతారామరాజు జిల్లా : రంపచోడవరం గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో దారుణం జరిగింది. కళాశాల కర్కశత్వానికి 44 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రి పాలయ్యారు. వివిధ కారణాలతో విద్యార్థినులకు పనిష్మెంట్ ఇచ్చారు ఆ ప్రిన్సిపల్.రెండు రోజుల పాటు కళాశాల విద్యార్థినులతో ఒక్కసారిగా 200 గుంజీలు తీయడం, వారితో పరుగులు తీయించడం చేయించారు. దీంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నడవలేని స్థితిలో ఉన్న విద్యార్థునులను నడవలేని స్థితిలో ఉన్న విద్యార్థుల్ని అత్యవసర చికిత్స కోసం రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్లో తరలించారు కళాశాల సిబ్బంది.ప్రిన్సిపల్ కఠిన శిక్షకు నడవలేని విద్యార్థునులు నడవలేని స్థితిలో రంపచోడవం ఆస్పత్రికి వెళ్లారు. కొంతమంది విద్యార్థునులను ఆస్పత్రి లోపలికి ఎత్తుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు విద్యార్థులు. కళాశాల ప్రినిపల్ తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని, నిర్దాక్షణ్యంగా శిక్షలు విధిస్తున్నారని, అన్నం తిన్న వెంటనే పరుగులు పెట్టిస్తున్నారని విద్యార్థునులు వాపోతున్నారు. -
బాలికలపై ప్రిన్సిపాల్ కర్కశత్వం 44 మందికి అస్వస్థత..
-
ఫుడ్ పాయిజన్తో 67మందికి అస్వస్థత
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్లోని గిరిజన ఆశ్రమ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ వల్ల 67 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పుట్టినరోజు సందర్భంగా శనివారం రాత్రి ఈ హాస్టల్లో సంబరాలు నిర్వహించారు. కేక్ కూడా కట్ చేశారు. అనంతరం విద్యార్థులు రాత్రి భోజనంతోపాటు పాయసం, పకోడీ తిన్నారు. అయితే, ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు కడుపునొప్పి బాధపడ్డారు. కొందరు వాంతులు చేసుకున్నారు. దీంతో వెంటనే వారిని వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకొని ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ప్రస్తుతం ఆస్పత్రికి చేరుకుంటున్నారు. -
బల్లిపర్రు బాలికల హాస్టల్పై విజి‘లెన్స్’
పెడన మండలం బల్లిపర్రులోని బాలయోగి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం విజిలెన్స్ అధికారులు తనిఖాలు చేశారు. అయితే, తనిఖీల సమయంలో సహకరించకపోతే వంట సిబ్బంది విజిలెన్స్ అధికారులకు ఎదురుతిరిగారు. ఏకవచనంతో సంభోదిస్తూ వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులతోపాటు టీచర్లు కూడా అవాక్కయ్యారు. పెడన : విజయవాడకు చెందిన విజిలెన్స్ సీఐ అపర్ణ, డీసీటీవో డి. చెన్నయ్య, హెడ్ కానిస్టేబుల్ అన్సారీ బుధవారం మధ్యాహ్నం బల్లిపర్రు గురుకుల పాఠశాల (హాస్టల్) తనిఖీకి వచ్చారు. భోజన సమయానికి వచ్చిన వీరు డైనింగ్ హాల్ను పరిశీలించారు. తనిఖీల సమయంలో అక్కడ పని చేస్తున్న టీచర్లు, సిబ్బంది నుంచి ఫోన్లు తీసేసుకున్నారు. పెరుగు ఎంత ఉందనే దానిపై కాటా వేస్తుండగా వంట సిబ్బందిలో పని చేస్తున్న రూబెన్ అనే పెళ్లి కాని యువకుడు విజిలెన్స్ అధికారులకు ఎదురుతిరిగాడు. తన ఫోన్ ఇవ్వాలంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు. కాంట్రాక్టరు తల్లి జయమ్మ కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుండటంతో అక్కడే ఉన్న టీచర్లు వారిస్తున్నా వినిపించుకోలేదు. గట్టిగట్టిగా అరుస్తూ గొడవపడ్డారు. ‘మీకు ఎందుకు సమాధానం చెప్పాలి.. మా కాంట్రాక్టు రద్దయినా పని చేస్తున్నాం, ఏం చేసుకుంటారో చేసుకోండి..’ అని సమాధానం చెప్పడంతో విజిలెన్స్ సీఐ అపర్ణ వెంటనే గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త పి. యానాదికి ఫోన్లో పరిస్థితిని వివరించి తక్షణం రావాల్సిందిగా కోరారు. డార్మెటరీ అధ్వానం...బాత్రూమ్లు అపరిశుభ్రం విద్యార్థినులు పడుకునే గదులున్న డార్మెటరీ అధ్వానంగా ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వాడకం నీరు లేకపోవడం, పై అంతస్తుల్లోని బాత్రూమ్ల వద్ద నీరు లీకై కారుతుండటం వంటి వాటిని ఫొటోలు తీసుకుని నివేదికలు రూపొందించారు. విద్యార్థినులకు సరిపడ గదులు లేవని నమోదు చేసుకున్నారు. బాత్రూమ్ల వద్ద అపరిశుభ్రత వాతావరణంపై సీఐ అసంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదులు, విద్యార్థినులుండే గదులు బూజుపట్టి ఉండటంపై టీచర్లను ప్రశ్నించారు. ఇష్టానుసారంగా రికార్డుల్లో నమోదు.. అధికారులు అటెండెన్స్ రిజిస్టర్లతో పాటు పలు రికార్డులను కూడా పరిశీలించారు. ఉన్నతాధికారులు రిలీవ్ చేయకుండా, ఎటువంటి ఉత్తర్వులు లేకుండానే ఈ నెల 21న ప్రిన్సిపల్ ఎన్వీ రమణమ్మ రిలీవ్ అయిపోతున్నట్లు అటెండెన్స్ రిజిస్టరులో సంతకం చేసి వెళ్లిపోయారు. అనంతరం 22న మూమెంట్ రిజిస్టరులో టీచర్లకు సూచనలు, సలహాలు చేసినట్లు ప్రిన్సిపల్ రమణమ్మ నమోదు చేసి ఉండటాన్ని గుర్తించారు. 24వ తేదీన సర్క్యులర్ రిజిస్టరులో జి భ్రమరాంబకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించినట్లు నమోదు చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా ఈ విధంగా రికార్డుల్లో రాయడం వంటి విషయాలను నమోదు చేసుకున్నారు. కుకింగ్ ఏజెన్సీ రద్దు.. గురుకుల పాఠశాలల (డీసీ) జిల్లా సమన్వయకర్త పి. యానాది, బదిలీపై వెళ్లిన ప్రిన్సిపల్ రమణమ్మ బుధవారం సాయంత్రం గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. వంట సిబ్బంది ఎదురుతిరిగిన సంఘటనలను సెల్ఫోన్ ద్వారా రికార్డు చేసి డీసీకి చూపించారు. ఆయన వంట ఏజెన్సీ కాంట్రాక్టరును పిలిచి చీవాట్లు పెట్టారు. విజిలెన్స్ సీఐ అపర్ణ మాట్లాడుతూ స్థానికంగా పని చేస్తున్న టీచర్ల విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండటంపై ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. టీచర్లంటే కూడా భయం లేకుండా సిబ్బంది ప్రవర్తించడం వంటివి భవిష్యత్కు మంచి పరిణామం కాదని స్పష్టం చేశారు. డీసీ యానాది స్పందిస్తూ తక్షణం కుకింగ్ ఏజన్సీని రద్దు చేసి మరొకరికి అప్పగించాలని సిబ్బందిని ఆదేశించడమే కాకుండా ఉత్తర్వులను రెడీ చేయాలని సూచించారు. విద్యార్థినులుండే చోట పెళ్లికాని యువకుడు ఏడాది నుంచి పని చేస్తుంటే పట్టించుకోకపోవడంపై సీఐ వారిని ప్రశ్నించారు. అనంతరం పలు విషయాలను నమోదు చేసుకున్న అనంతరం విజిలెన్స్ అధికారులు వెనుదిరిగారు. సౌజన్యకు ఇన్చార్జి బాధ్యతలు.. గురుకుల పాఠశాలలో ఇటీవల బదిలీపై వచ్చిన బయాలజీ టీచరు ఎం. సౌజన్యకు ఇన్చార్జి బాధ్యతలను డీసీ యానాది అప్పగించారు. పది రోజులు ఇన్చార్జిగా వ్యవహరించాలని, అనంతరం జిల్లాలో సీనియర్ను తీసుకువచ్చి రెగ్యులర్ ప్రిన్సిపల్గా నియమిస్తామని చెప్పారు. -
30 మంది విద్యార్థినులకు అస్వస్థత
కోవెలకుంట్ల (కర్నూలు) : కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండల కేంద్రంలోని గురుకుల బాలికల వసతి గృహంలో విష జ్వరాలు ప్రబలి 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది గుర్తించిన హాస్టల్ వార్డెన్ వైద్య అధికారులను సంప్రదించడంతో.. ఆదివారం వసతిగృహం ఆవరణలో ప్రత్యేక వైద్య శిభిరం ఏర్పాటు చేసి విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారు.