ధ్వజారోహణం.. సకల దేవతలకు ఆహ్వానం | Tirupati Brahmotsavam Started With Flag Hoisting | Sakshi
Sakshi News home page

ధ్వజారోహణం.. సకల దేవతలకు ఆహ్వానం

Sep 28 2022 9:12 AM | Updated on Sep 28 2022 9:28 AM

Tirupati Brahmotsavam Started With Flag Hoisting - Sakshi

సకల దేవతలు, అష్టదిక్పాలకులు తొమ్మిది రోజులూ సప్తగిరి క్షేత్రంలో ఉంటూ ఉత్సవాలను తిలకించి తన్మయత్వం పొందుతారని పురాణాలు విశదీకరిస్తున్నాయి. 

సాక్షి, తిరుమల: విశ్వపతి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ఆరంభమయ్యాయి. ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పతాకావిష్కరణతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. సకల దేవతలు, అష్టదిక్పాలకులు తొమ్మిది రోజులూ సప్తగిరి క్షేత్రంలో ఉంటూ ఉత్సవాలను తిలకించి తన్మయత్వం పొందుతారని పురాణాలు విశదీకరిస్తున్నాయి.
చదవండి:  నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌ 

ధ్వజారోహణానికి ముందు తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప, పరివార దేవతలైన ఆదిశేషుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు, గరుడధ్వజం, సుదర్శన చక్రతాళ్వార్‌తో కలసి ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement