ఐడీ కార్డులు చూపించాలంటూ టీడీపీ మాజీ మంత్రి దాదాగిరి

TDP Leaders And Amaranath Reddy Rude Behaviour With Police At Kuppam - Sakshi

సాక్షి, చిత్తూరు: రామకుప్పం మండలంలో టీడీపీ నాయకులు బరితెగించారు. కుప్పంలో సోమవారం మున్సిపల్‌ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో టీడీపీ నాయకులు ఓటర్లను బెదిరిస్తూ ప్రలోభపెడుతున్నారు. సల్దిగానిపల్లె వద్ద వాహనాలను ఆపి ప్రయాణికుల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారు.

ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వారందరినీ ఐడీ కార్డులు చూపించాలంటూ దాదాగిరి చేశారు. రోడ్డుపై బైఠాయించి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు. వీరిని అడ్డుకున్న పోలీసులపై కూడా ఆయన అనుచరులు దాడికి తెగబడ్డారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

చదవండి:  (కుప్పంలో టీడీపీ అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top