సాక్షి, అనంతపూర్: కళ్యాణదుర్గం నియోజక వర్గం శెట్టూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ గోడ కూలి హర్షవర్ధన్ అనే విద్యార్థి మృతి చెందాడు. అక్షయ్ అనే మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి బహిర్భూమికి వెళ్లిన సందర్భంలో గోడ కూలినట్లు హస్టల్ సిబ్బంది తెలిపారు.


