టార్గెట్‌ 5 లక్షలు | State wide public mobilization for Prime Minister meeting | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ 5 లక్షలు

May 2 2025 5:00 AM | Updated on May 2 2025 5:00 AM

State wide public mobilization for Prime Minister meeting

ప్రధాని సభకు రాష్ట్రవ్యాప్తంగా జన సమీకరణ 

ప్రధానంగా డ్వాక్రా మహిళలు, ‘ఉపాధి’ కూలీలపై ఒత్తిడి 

తప్పనిసరిగా రావాల్సిందేనని ఆదేశం 

తరలింపునకు వేలాది ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్‌ బస్సులు 

ఒక్క గుంటూరు జిల్లా నుంచే 1,241 బస్సులు  

విద్యార్థులను సైతం తరలించాలని ప్రభుత్వ పెద్దల సూచన.. డ్వాక్రా, సచివాలయ సిబ్బందికి బాధ్యతలు  

బస్సులు లేక ఊరూరా ప్రయాణికుల ఇక్కట్లు  

సాక్షి నెట్‌వర్క్‌: అమరావతి రాజధాని పునః­ప్రారంభ కార్యక్రమానికి ప్రభుత్వ పెద్దల టార్గెట్‌ మేరకు జన సమీకరణ చేసేందుకు అధి­కార యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ప్రతి జిల్లా నుంచి.. ప్రతి నియోజ­క­వ­ర్గం నుంచి ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్‌ బస్సుల్లో జనా­న్ని తరలించేందుకు ఏర్పాట్లు పూర్త­య్యా­యి. వచ్చి తీరా­ల్సిం­దేనని, లేదంటే నష్టపో­తా­రంటూ భయ­పెట్టి.. డ్రాక్రా మహిళలు, ఉపాధి కూలీలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఆ చివర ఉన్న అనంతపురం మొదలు.. ఈ చివర ఉన్న శ్రీకాకుళం వరకు టీడీపీ నేతలు, అధి­కారులకు టార్గెట్‌ నిర్దేశించా­రు.

ప్రధాని మోదీ పాల్గొనే సభకు 5 లక్షలకు మించి జనం ఉండేలా చూడాలని ప్రభు­త్వ పెద్దలు దిశా నిర్దే­శం చేశారు. జన సమీక­రణలో ఎవరికీ మినహా­యింపు లేదని తెగేసి చెప్పడంతో ఉన్నతాధికా­రులు, కూటమి నేతలు నేరుగా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ జన సమీ­కరణకు ఏర్పా­ట్లు చేశారు. భారీగా వాహ­నాలు సమకూ­ర్చాల్సి రావడంతో కొన్ని చోట్ల ప్రభుత్వ సిబ్బందిపై ఈ భారం పడుతోంది. వాహనాల ఖర్చును తహసీల్దార్లు, డీఆర్డీఏ పీడీలు ఇతర సిబ్బందిపై రు­ద్దారు. జన సమీకరణ బాధ్యత డ్వాక్రా సంఘా­ల లీడర్లపై మోపారు. 

వారికయ్యే భోజనం, బస్సు­ల డీజిల్‌ ఖర్చులు కూడా అధికా­రులే చూసు­కోవాలని కొన్ని చోట్ల ఆదేశించడంతో వా­రు ఉక్కిరిబిక్కిరి అవుతు­న్నా­రు. అమరావతికి వెళ్లే వాహనాలకు అనుమతులు లేవ­ంటూ ఇబ్బంది పెట్టొద్దని రవాణా శాఖ అధికా­రులకు ఆదేశాలు అందాయి. దీంతో స్కూలు, కాలేజీల బస్సులను జన సమీకరణ కోసం కేటా­యించారు. యజమా­నులతో మాట్లాడి ప్రైవేటు వాహనా­లను కూడా సభకు పంపించాలని ఒత్తిడి తెచ్చా­రు.

 రాజధాని సమీప జిల్లాల నుంచి విద్యా­ర్థులను కూడా తరలించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించడంతో అధికా­రులు ఆ ప్రాంతాల్లోని కాలేజీల యాజమాన్యాలతో మాట్లా­డారు. మొత్త­ంగా వేలాది ఆర్టీసీ బస్సు­లను జన సమీకరణకు కేటాయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రయాణి­కులు తీవ్ర ఇబ్బందులు ప­డ్డారు. శుక్ర­వారం కూడా ప్రజ­లకు ఈ ఇబ్బందులు తప్పవు. ఒక్క గుంటూరు జిల్లా నుంచే 1,241 బస్సులు కేటాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement