ప్రత్యేక రైళ్లు పొడిగింపు | Special trains extended | Sakshi
Sakshi News home page

ప్రత్యేక రైళ్లు పొడిగింపు

Jun 18 2025 2:53 AM | Updated on Jun 18 2025 2:53 AM

Special trains extended

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్‌ మేరకు చర్లపల్లి–నర్సాపూర్, జాల్నా–తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ పీఆర్‌వో నుస్రత్‌ మండ్రూప్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి–నర్సాపూర్‌ (07233) ప్రత్యేక రైలు జూలై 5 నుంచి వచ్చే ఏడాది మార్చి 28 వరకు ప్రతి శనివారం రాత్రి 7.50 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గం.లకు నర్సాపూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07234) జూలై 6 నుంచి వచ్చే ఏడాది మార్చి 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. 

రెండు మార్గాల్లో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్‌లలో ఆగుతుంది. ఇక జాల్నా–తిరుపతి (07609) రైలు జూలై 7 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకు ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు జాల్నాలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 

తిరుగు ప్రయాణంలో (07610) జూలై 8 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3.50 గంటలకు జాల్నా చేరుకుంటుంది. ఈ రైలు బీదర్, మారపల్లి, వికారాబాద్, లింగంపల్లి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్‌లలో ఆగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement