గుండ్లపాడు జంట హత్య కేసులో ఆరుగురి అరెస్ట్‌ | Six arrested in Gundlapadu double assassination case | Sakshi
Sakshi News home page

గుండ్లపాడు జంట హత్య కేసులో ఆరుగురి అరెస్ట్‌

Jun 6 2025 3:15 AM | Updated on Jun 6 2025 3:15 AM

Six arrested in Gundlapadu double assassination case

వర్గపోరు నేపథ్యంలో జవిశెట్టి సోదరుల్ని హతమార్చిన టీడీపీ నేతలు

ఆరుగురు నిందితులూ టీడీపీకి చెందిన వారే

పిన్నెల్లి సోదరుల కోసం గాలిస్తున్నామన్న పల్నాడు ఎస్పీ

రాజకీయ కక్షతో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై అక్రమ కేసు

పిన్నెల్లి సోదరుల పాత్రపై ఆధారాలు చూపని పోలీసులు

సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో ఆరుగురు నింది­తులను అరెస్ట్‌ చేసినట్టు పల్నాడు ఎస్పీ కంచి శ్రీని­వా­స­రావు గురువారం వెల్లడించారు. ఈ కేసులో టీడీపీకి చెందిన తోట వెంకట్రామయ్య, జవిశెట్టి శ్రీనివాస­రావు, తోట గురవయ్య, దొంగరి నాగరా­జు, తోట వెంకటేశ్వర్లు, గెల్లిపోగు విక్రంలను ఈ నెల 4న సాయంత్రం వెల్దుర్తిలో అరెస్ట్‌ చేసినట్టు చెప్పారు.

టీడీపీలో వర్గపోరు నేపథ్యంలో గత నెల 24న గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు (మొద్దయ్య), జవిశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురైన విషయం విదితమే. వెంటనే ఘటనాస్థలాని­కి వెళ్లి ప్రాథమిక విచారణ జరిపిన ఎస్పీ శ్రీనివాస­రావు చనిపోయిన, చంపిన వ్యక్తులు టీడీపీకి చెందిన వారేనని మీడియాకు వీడియో రూపంలో వివరించారు. 

మృతుల సమీప బంధువు తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామి­రెడ్డి, పిన్నెల్లి వెంకటరెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నా­మని, త్వరలో అరెస్ట్‌ చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. 

పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసు
జంట హత్యల కేసును వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై నెట్టాలన్న దురుద్దేశంతో పోలీసు­లు ఓ కట్టుకథ అల్లారు. హత్యలపై టీడీపీ నేత తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదులో గ్రామ టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే హత్యలు జరిగాయని తెలి­పా­డు. జవిశెట్టి వెంకటేశ్వర్లును హతమారిస్తే టీడీపీలో త­నకు ఎదురుండదని, రానున్న సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ ఉండదన్న కారణంతోనే నిందితుడు తోట వెంకట్రామయ్య హత్య చేశాడని స్పష్టం చే­శా­రు. 

ఆ తరువాత ఎలాగైనా పిన్నెల్లి సోదరులను కేసు­లో ఇరికించాలన్న దుర్బుద్ధితో కట్టుకథ అ­ల్లారు. హ­త్యలో పాల్గొన్న నిందితులు జవిశెట్టి శ్రీ­ను, తోట వెంకట్రా­మయ్య, తోట గురవయ్య, దొంగరి నాగ­రాజు హత్యానంతరం ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనే­యు­లును కారులోని కత్తులు తీసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజంగా కారులో కత్తులే ఉంటే.. జవిశెట్టి సోదరులను బండరాళ్లతో మో­ది ఎందుకు చంపుతారని, వారిని హత్య చేసేందు­కు కత్తులే వాడే­వారు కదా అన్న ప్రశ్నలు తలె­త్తు­తున్నాయి. 

పోలీ­సుల ఎఫ్‌ఐఆర్, ప్రభుత్వ వైద్యు­ల పంచనామాలో ఎక్కడా కత్తులు వాడినట్టు పేర్కొ­నలేదు. ‘వచ్చేది మా వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వ­మే. మి­మ్మ­ల్ని బతక­నివ్వం. మాజీ ఎమ్మె­ల్యే పిన్నె­ల్లి రామ­కృష్ణారెడ్డి, వెంకట్రా­మరెడ్డి చెబితేనే మేం చేస్తున్నాం. మాకు ఏమైనా ఆపద వస్తే వాళ్లు చూ­సుకుంటారు’ అంటూ హత్యా­నంతరం నిందితు­లు కారులోంచి కతు­్తలు చూపించి బెదిరిస్తూ వెళ్లిపో­యా­రని ఫి­ర్యా­దులో పేర్కొన్నారు. 

నిజంగా హత్య­కు పిన్నెల్లి సోద­రులు కుట్ర పన్ని ఉంటే ఇలా చెబు­తా­రా? అన్న అను­మానాలు వ్యక్తమవుతు­న్నా యి. ఇది కేవలం పిన్నెల్లి సోదరులను అక్రమంగా ఇ­రి­కించేందుకే ప్రభుత్వం, పోలీసులు పన్నిన కుట్రగా అర్థమ­వుతోంది. నిందితులు బెదిరించార­న్న కట్టుక­థలు తప్ప ఈ హత్య­లో పిన్నెల్లి సోదరుల పాత్రపై ఎటువంటి ఆధారాలు దొరకలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement