Sajjala Ramakrishna Reddy Meets CM YS Jagan, Details Inside - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌తో భేటీ.. సజ్జల ఏమన్నారంటే..?

Apr 8 2022 8:13 PM | Updated on Apr 8 2022 8:28 PM

Sajjala Ramakrishna Reddy Meets CM YS Jagan - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు.

సాక్షి, తాడేపల్లి: తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. రెండు గంటలకుపైగా ఇరువురి మధ్య చర్చ జరిగింది. భేటీ అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మంత్రి వర్గ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఇతర అంశాలపై చర్చించామన్నారు. మంత్రి వర్గంలో ఎవరు ఉండాలనేది పూర్తిగా సీఎం నిర్ణయం అన్నారు. అందులో ఎవరి ప్రమేయం ఉండదని, విస్తరణపై కసరత్తు కొనసాగుతోందని సజ్జల అన్నారు.
చదవండి: వాళ్ల కడుపు మంటకు మందే లేదు: సీఎం జగన్‌


 

Advertisement
 
Advertisement
Advertisement