
ఉడుమూడి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు.
రహదారి పక్కన ట్రాక్టర్ ఫై ధాన్యం బస్తాలు ఎగుమతి చేస్తుండగా కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడే దుర్మరణం చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోగా, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.