తిరుమల: ఘాట్ రోడ్డులో కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఆరుగురికి గాయాలు!

సాక్షి, తిరుపతి: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో రెండో మలుపు వద్ద ఆగిఉన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. దీంతో, వెంటనే వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.