
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో కారును వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.