వైఎస్‌ జగన్‌ ఘనత.. 2022–23లో ఏపీలో తగ్గిన పేదరికం | Reduced poverty 2022-2023 in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ ఘనత.. 2022–23లో ఏపీలో తగ్గిన పేదరికం

Aug 25 2024 9:01 AM | Updated on Aug 25 2024 9:09 AM

Reduced poverty 2022-2023 in Andhra Pradesh

లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమతో మేలు

రైతుల ఆదాయం పెంపుతో మెరుగుపడిన జీవనోపాధి 

ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదికలో వెల్లడి    

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయడం, రైతన్నలకు పెట్టుబడి సాయం అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవనోపాధి మెరుగుపడింది. తద్వారా వారి పేదరికం జాతీయ స్థాయి కన్నా తక్కువగా నమోదైంది. ఈ విషయాన్ని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 2022–23 నాటికి పేదరికం నిష్పత్తిని ఈ నివేదిక విశ్లేషించింది. 

గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో పేదరికం 7.10 శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.62 శాతం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఐదు శాతం కన్నా దిగువున ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 4.40 శాతం ఉన్నట్లు తెలిపింది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా పేదరికం తగ్గినట్లు ఈ నివేదిక పేర్కొంది. 

దీనికి ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను నిర్మించడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించడమని స్పష్టం చేసింది. వీటి ద్వారా గ్రామీణ జీవనోపాధిని గణ­నీయంగా మెరుగు పరచిందని నివేదిక తెలి­పిం­ది. ప్రభుత్వాలు అమలు చేసిన కార్య­క్రమాలతో  పేదరికం తగ్గడంతో పాటు గ్రామీ­ణ, పట్టణ పేదల జీవనోపాధి మెరుగుపడిందని నివేదిక స్పష్టం చేసింది. అలాగే జాతీయ స్థాయిని మించి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాల్లో పేదరికం ఉందని పేర్కొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement