ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్

సాక్షి, తూర్పుగోదావరి: ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ మంజూరైంది. మూడు రోజుల పాటు రాజమండ్రి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న(ఆదివారం)అనంతబాబు తల్లి మంగారత్నం మృతిచెందిన సంగతి తెలిసిందే. తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు అనంతబాబుకు ఈ నెల 25 సాయంత్రం వరకూ న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
చదవండి: పదో తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం