విశాఖ: గాజువాకలో కన్స్ట్రక్షన్లో ఉన్న రైల్వే బ్రిడ్జి డకింగ్ కుప్పకూలింది. పిల్లర్లకు మధ్య కాంక్రీట్ వేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. గాయపడ్డవారికి చికిత్స అందుతోంది.




