కొండచిలువ పాట్లు.. నాలుగు కోళ్లను మింగేసి ఎటూ కదల్లేక 

Python Eats 4 Chicks In Odisha - Sakshi

బొబ్బిలి రూరల్‌: మండలంలో జె.రంగరాయపురంలో ఆదివారం గ్రామానికి చెందిన పూడికూర్మారావు పశువుల శాల వద్ద ఎనిమిది అడుగుల కొండచిలువ కోళ్లగూటిలో దూరి నాలుగు కోళ్లను మింగేసింది. అనంతరం ఎటూ కదల్లేక అక్కడే ఇబ్బంది పడసాగింది. గతంలో కూడా కొండచిలువలు గ్రామంలోకి వచ్చి సందర్భాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. వేగావతి నదిలో నుంచి వచ్చి ఉండొచ్చని చర్చించుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top