మాటేసి ఉన్నాం.. మాస్క్ లేకుండా వచ్చారో జాగ్రత్త’’
Published
Sat, Apr 24 2021 12:08 PM
బత్తలపల్లి: ‘‘మాటేసి ఉన్నాం... మాస్క్ లేకుండా బయటకొచ్చారో జాగ్రత్త’’ అంటూ యముడు వేషధారి కరోనా వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతపురం జిల్లా బత్తలపల్లి నాలుగు రోడ్ల కూడలిలో ఆర్డీటి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కళాకారులు ఆంజనేయులు, శ్రీరాములు, సుదర్శన్లు ప్రజలు కరోనా బారిన పడకుండా అప్రమత్తం చేశారు.