
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లికీ చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల డైరెక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం ఇంటి నుండి వెళ్లిపోయిన భవిష్య విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీధర్.. విజయవాడ ప్రకాశం బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
ఆర్థిక ఇబ్బందులే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. మృతదేహం లభ్యమైంది. విజయవాడ పోలీసులు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.