‘లోకేష్‌ అన్యాయం చేశారు మీరైనా..’ పట్టించుకోని పవన్‌! | PET Candidates Protest At Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘లోకేష్‌ అన్యాయం చేశారు మీరైనా..’ పట్టించుకోని పవన్‌!

Apr 29 2025 1:05 PM | Updated on Apr 29 2025 1:25 PM

PET Candidates Protest At Pawan Kalyan

గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. మంగళగిరి జనసేన కార్యాలయంలో ఇవాళ ఆ పార్టీ ఆధ్వర్యంలో పహల్గాం సంతాప సభ జరిగింది. అయితే ఆ సమయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(PET) అభ్యర్థులు ఆయన కోసం నిరసన చేపట్టారు

డీఎస్సీ నుంచి పీఈటీని ఎత్తేయడంపై ఆయన్ని ప్రశ్నించారు. పాదయాత్రలో నారా లోకేష్‌ తమకు హామీ ఇచ్చి మోసం చేశారని.. కనీసం మీరైనా న్యాయం చేయాలని పవన్‌ను ఉద్దేశిస్తూ ఫ్లెక్సీ, ఫ్లకార్డులు పట్టుకున్నారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, దాని ద్వారానే పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

పవన్‌ కాన్వాయ్‌ వస్తున్న సమయంలో వాళ్లు తమ నినాదాలను పెంచారు. అయితే పవన్‌ వాళ్లను కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో వాళ్లు నిరాశ చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement