సర్పంచ్‌లతో నేడు మంత్రి పెద్దిరెడ్డి సమావేశం 

Peddireddy Ramachandra Reddy meeting with Sarpanches today - Sakshi

‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’పై వీడియో కాన్ఫరెన్స్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామ సర్పంచ్‌లతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. జూలై 8 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించనున్న ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమం అమలుపై ఆయన సర్పంచ్‌లతో చర్చిస్తారు. ప్రతిధ్వని పేరుతో పంచాయతీరాజ్‌ శాఖ నిర్వహించే ఈ కార్యక్రమంలో 13 జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున 26 మంది సర్పంచ్‌లు మంత్రితో మాట్లాడనున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top