రాళ్లదాడి అంతా బూటకం: మంత్రి పెద్దిరెడ్డి | Peddireddy Ramachandra Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

రాళ్లదాడి పేరుతో చంద్రబాబు సానుభూతి డ్రామా

Apr 15 2021 12:33 PM | Updated on Apr 15 2021 1:56 PM

Peddireddy Ramachandra Reddy Comments On Chandrababu - Sakshi

‘‘రాళ్లదాడి అంతా బూటకమని తేలింది. ఆ పేరుతో చంద్రబాబు సానుభూతి డ్రామా ఆడారు. టీడీపీ మూతపడటం ఖాయం. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై చంద్రబాబు ఏం జవాబు చెబుతారని’’ మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు.

సాక్షి, తిరుపతి: చంద్రబాబుపై రాళ్ల దాడి అవాస్తవమని  పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఆరోపణలు అసత్యమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనే తమ అభ్యర్థిని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ‘‘రాళ్లదాడి అంతా బూటకమని తేలింది. ఆ పేరుతో చంద్రబాబు సానుభూతి డ్రామా ఆడారు. టీడీపీ మూతపడటం ఖాయం. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై చంద్రబాబు ఏం జవాబు చెబుతారని’’ మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు.

తిరుపతి ప్రజలను ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని.. మతాన్ని రెచ్చగొట్టేలా బీజేపీ వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. లబ్దిదారులే తమ​కు ఓట్లు వేయాలనుకుంటున్నారని.. వాలంటీర్లను ప్రభావితం చేయాల్సిన అవసరం లేదని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
చదవండి:
టీడీపీ నేత కూన రవికుమార్ అరెస్ట్‌
ఆనందం.. అంతలోనే విషాదం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement