కృష్ణపట్నం చేరుకున్న ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌

Oxygen Express to Krishnapatnam - Sakshi

60.66 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ దిగుమతి

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్‌ కృష్ణపట్నం పోర్టుకు శుక్రవారం ఒడిశా నుంచి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ వచ్చింది. ఈ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ ద్వారా రెండు ట్యాంకర్లలో నింపిన 60.66 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను ఒడిశాలోని రూర్కెలా నుంచి రాష్ట్రానికి తరలించారు. ఈ రైలు 1,305 కిలోమీటర్ల దూరాన్ని 22 గంటల వ్యవధిలో ప్రయాణించి కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంది.

ఇప్పటివరకు విజయవాడ డివిజన్‌కు వచ్చిన ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లలో ఇది నాలుగోది. ఈ నాలుగు ప్రత్యేక రైళ్ల ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 275 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రాష్ట్రానికి దిగుమతి జరిగింది. ఈ సందర్భంగా డీఆర్‌ఎమ్‌ పి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రీన్‌ కారిడార్‌లను ఏర్పాటు చేసి అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో నిర్దేశించిన గడువులోగా ఇవి గమ్యస్థానాలకు చేరుకునేలా కృషి చేస్తున్నామని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top