వాయుగుండంగా మారిన అల్పపీడనం | Moderate rains in Coastal Andhra and Rayalaseema from Saturday to Tuesday | Sakshi
Sakshi News home page

వాయుగుండంగా మారిన అల్పపీడనం

Nov 26 2025 4:08 AM | Updated on Nov 26 2025 4:08 AM

Moderate rains in Coastal Andhra and Rayalaseema from Saturday to Tuesday

సాక్షి,అమరావతి: అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది రాబోయే 48 గంటల్లో మ­రింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది. మరో­వైపు నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక మరియు హిందూ మహాసముద్రం మీదుగా మరో అల్పపీడనం కేంద్రీకృతమైందని విప­త్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. 

ఇది ఉత్తర­వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడ­నంగా మారి వాయుగుండంగా బల­పడే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement