వాయుగుండంగా మారిన అల్పపీడనం | Moderate rains in Coastal Andhra and Rayalaseema from Saturday to Tuesday | Sakshi
Sakshi News home page

వాయుగుండంగా మారిన అల్పపీడనం

Nov 26 2025 4:08 AM | Updated on Nov 26 2025 4:08 AM

Moderate rains in Coastal Andhra and Rayalaseema from Saturday to Tuesday

సాక్షి,అమరావతి: అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది రాబోయే 48 గంటల్లో మ­రింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది. మరో­వైపు నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక మరియు హిందూ మహాసముద్రం మీదుగా మరో అల్పపీడనం కేంద్రీకృతమైందని విప­త్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. 

ఇది ఉత్తర­వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడ­నంగా మారి వాయుగుండంగా బల­పడే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement