‘ఆ దృష్టితో కాదు.. ధర్మ దృష్టితో చూడాలి’ | Minister Perni Nani Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టు పట్టించారు

Sep 19 2020 1:26 PM | Updated on Sep 19 2020 3:30 PM

Minister Perni Nani Fires On Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టు పట్టించారని, తన అనుకూల మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘టీడీపీకి క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులు.. ఇప్పుడు న్యాయవ్యవస్థలో ఉన్నారు. మిధున్‌రెడ్డి లేవనెత్తిన అంశంపై కేంద్రం, సుప్రీంకోర్టు దృష్టి సారించాలి. ఏపీ న్యాయవ్యవస్థ తీరుపై ప్రతి ఒక్కరూ స్పందించాలని’’ ఆయన కోరారు. అమరావతి పేరుతో లీటరుపై రూ.2 పెంచినప్పుడు ఎల్లో మీడియా ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. మీడియా దృతరాష్ట్ర దృష్టితో కాకుండా ధర్మదృష్టితో చూడాలని మంత్రి పేర్ని నాని హితవు పలికారు. (చదవండి: హైకోర్టు తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం)
(చదవండి: టీడీపీ లాయర్లే జడ్జిలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement