విశాఖ : మాలలు తీసేందుకు అప్పికొండ శివాలయానికి వెళ్లిన శివస్వాములకు చేదు అనుభవం ఎదురైంది. శివస్వాములు మాలలు తీసేందుకు కనీస ఏర్పాట్లు చేయడాన్ని పక్కకు పెట్టిన అధికారులు.. ఏకంగా ఆలయానికే తాళాలు వేశారు. 41 రోజుల దీక్ష అనంతరం అప్పికొండ దేవాలయంలో మాలలు తీయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే శివ స్వాములు మాలలు తీయడానికి వెళ్తే ఆలయ అధికారులు శివాలయానికి తాళం వేసేశారు.
దాంతో అధికారులు, పోలీసుల తీరుపై శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాములకు కనీస సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని శివస్వాములు మండిపడుతున్నారు. ఆచారం ప్రకారం పూజలు చేసుకోనివ్వడం లేదని, దేవాదయ, పోలీస్ శాఖ వారు దుర్మార్గంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఏ అధికారి పర్యవేక్షిస్తున్నారో కూడా తెలియదని, ఈ విధంగా వ్యవహరించడం దారుణమని అధికారుల తీరును తప్పుబట్టారు.


