తెలుగు భాష సంస్కృతం నుంచే మమేకమైందని గుర్తించాలి: లక్ష్మీపార్వతి

Lakshmi Parvathi Comments About Changing Telugu Akademi Name - Sakshi

సాక్షి, గుంటూరు: తెలుగు భాష సంస్కృతం నుంచే మమేకమైందన్న విషయాన్ని గుర్తించాలని ఏపీ సాహిత్యఅకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. అలాంటప్పుడు తెలుగు అకాడమీని తెలుగు&సంస్కృత అకాడమీగా పేరు మార్చడంలో తప్పులేదని వ్యాఖ్యానించారు. గతంలో తెలుగు అకాడమీని చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారని, సీఎం జగన్ ప్రభుత్వంలో తెలుగు అకాడమీకి పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు. తిరుపతిలో తెలుగు&సంస్కృతం అకాడమీ భవనం నెలకొల్పారని, భాషా చైతన్య సదస్సులను రాష్ట్రంలోని అన్ని వర్శిటీల్లో నిర్వహిస్తామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top