ఆశ్రమ పాఠశాలలో విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి | Student dies of electrocution at Ashram school | Sakshi
Sakshi News home page

ఆశ్రమ పాఠశాలలో విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి

Aug 8 2026 5:08 AM | Updated on Aug 8 2026 5:08 AM

Student dies of electrocution at Ashram school

మృతదేహంతో పాఠశాల వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల ధర్నా  

రూ.50వేల సాయం అందించి చేతులు దులుపుకొన్న కేఆర్‌పురం ఐటీడీఏ పీవో 
 

వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం శివకాశీపురం గిరిజన బాలికోన్నత పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థిని కె­చ్చె­ల లక్ష్మీపార్వతి (13) శుక్రవారం విద్యుదాఘా­తంతో మృతిచెందింది. మండలంలోని చిట్టంరెడ్డిపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీపార్వతి 8వ తరగతి చదువుతోంది. శుక్రవారం ఉదయం పాఠశాలకు ఆనుకుని ఉన్న మరో భవనంలో ఆరబెట్టిన దుస్తులు తీసుకునేందుకు వెళ్లింది. దుస్తులు అందకపోవడంతో అక్కడున్న ఇనుప స్టాండ్‌పై ఎక్కి ఇనుప కిటికీని పట్టుకుంది. ఆ కిటికీకి విద్యుత్‌ సరఫరా అవుతుండటంతో షాక్‌కు గురై కేకలు వేసింది. 

మరో విద్యార్థిని దీపి­క ఆమెను చున్నీతో లాగింది. వెంటనే ఆమెను వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ని­ర్ధారించారు. లక్ష్మీపార్వతి మృతికి హాస్టల్‌ వార్డెన్, హెచ్‌ఎం కారణమంటూ తల్లిదండ్రులు కెచ్చెల అమల, సుధాకర్‌రెడ్డి, బంధువులు ఆగ్ర­హం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని మోసుకుని ఆశ్రమ పాఠశాల గేటు వద్దకు తీసుకెళ్లి బైఠాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement