తిరుమల: తిరుమలలో వర్షం కురవడంతో సోమవారం ఓ భక్తుడు జనసేన పార్టీకి సంబంధించిన గొడుగును శ్రీవారి ఆలయం ముందు వేసుకుని వెళ్లడం విమర్శలకు దారి తీసింది. తిరుమలలో రాజకీయ నాయకుల బొమ్మలు కానీ గుర్తులకు కానీ అనుమతి లేదు. ఎలాంటి ప్రచారాలకు తావు లేకుండా కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ తరుణంలో జనసేన పార్టీ గొడుగును చూసిన భక్తులు మండిపడుతున్నారు. 


