ప్రకాశం: పసికందును బలిగొన్న వానరం | Infant dies in monkey attack in Prakasam district | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో ఘోరం: నిద్రిస్తున్న పసికందును బలిగొన్న వానరం

Dec 2 2022 7:20 PM | Updated on Dec 2 2022 7:25 PM

Infant dies in monkey attack in Prakasam district - Sakshi

రెండు నెలల పసికందును ఆరుబయట పడుకోబెట్టిన ఆ తల్లికి.. 

సాక్షి, ప్రకాశం: జిల్లాలో శుక్రవారం ఘోరం జరిగింది.  పసిబిడ్డను ఓ కోతి బలి తీసుకుంది. ఆరుబయట నిద్రపోతున్న ఓ చిన్నారిని ఈడ్చుకెళ్లి కిందపడేసింది వానరం. ఈ క్రమంలో తలకు తీవ్రగాయం కావడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. 

పెదచర్లోపల్లి మండలం మురుగుమ్మిలో ఈ ఘటన జరిగింది. రవీంద్ర-సుమతీ దంపతులు స్థానికంగా పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు. రెండు నెలల కిందటే బిడ్డకు జన్మనిచ్చింది సుమతీ. ఈ క్రమంలో ఎప్పటిలాగే.. పసికందును ఆరుబయట మంచం మీద పడుకోబెట్టి ఇంటి పనులు చేసుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ కోతి.. పసికందును మంచం మీద నుంచి ఈడ్చుకెళ్లింది. 

గట్టిగా కిందపడేయడం.. అదే సమయంలో అక్కడే ఉన్న వ్యవసాయ సామాగ్రి ఆ పసికందుపై పడడంతో అక్కడికక్కడే కన్నుమూసింది. అలికిడికి అక్కడికి వచ్చిన తల్లి.. రక్తపు మడుగులో ఉన్న బిడ్డను చూసి కన్నీరుమున్నీరు అయ్యింది. పసికందు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement