పాడి రైతులకు పండుగ | Increased Amul milk procurement prices Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పాడి రైతులకు పండుగ

Dec 15 2022 3:33 AM | Updated on Dec 15 2022 3:35 AM

Increased Amul milk procurement prices Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ ద్వారా పా­లను సేకరిస్తున్న అమూల్‌ సంస్థ తాజాగా ఐదో­సారి పాల సేకరణ ధరలను పెంచింది. లీటర్‌కు గరిష్టంగా గేదె పాలపై రూ.3.37, ఆవు పాలపై రూ.1.73 చొప్పున పెంచింది. కిలో వెన్నపై రూ.31, ఘన ప­దా­ర్థాలపై రూ.12 మేర సేకరణ ధర పెరిగింది. ఈ పెంపు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో గురు­వారం నుంచి వర్తించనుంది. దీని­ద్వారా 40 వేల మంది రై­తులకు అదనంగాలబ్ధి చేకూరనుంది. గత రెం­డేళ్లలో ఇప్పటికే నాలుగు దఫాలు పాల సేక­రణ ధర­లను పెంచగా తాజా పెంపుతో ఐదోసారికి చేరు­కుంది. 

మూడు నెలల్లోనే మళ్లీ..
అమూల్‌ తరఫున రాయలసీమలో కైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్‌ యూ­ని­యన్లు పాలను సేకరిస్తున్నాయి. పథకం ప్రారంభించినప్పుడు లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.71.47, ఆవు పాలకు రూ.34.20 చొప్పున చె­ల్లిం­చింది. ప్రస్తుతం లీటర్‌ గేదె పాలకు రూ.84.15, ఆవు పాలకు రూ.40.73 చొప్పున చెల్లిస్తోంది.

అమూల్‌ తరఫున ఉత్తరాంధ్రలో పాలను సేకరి­స్తున్న బనస్కాంత్‌ జిల్లా కో ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొ­డ్యూసర్స్‌ యూనియన్‌ సెప్టెంబర్‌లో పాల సేకరణ ధరలు పెంచగా 3 నెలలు తిరగకుండానే మరోసారి పెంచడం గమనార్హం. తాజా పెంపుతో లీటర్‌కు గరిష్టంగా గేదె పాలు రూ.87.52, ఆవు పాలు రూ.42.46 చొప్పున పెరిగాయి. అమూల్‌ గత రెండేళ్లలో గేదె పాలపై రూ.16.05, ఆవు పాలపై రూ.8.26 మేర పెంచింది.

రెండేళ్లలో 5.40 కోట్ల లీటర్ల సేకరణ
జగనన్న పాలవెల్లువ ద్వారా 2020 డిసెంబర్‌లో 3 జిల్లాల్లో పాల సేకరణకు శ్రీకారం చుట్టగా 2 నెలల్లోనే 17 జిల్లాలకు విస్తరించారు. 27,277 మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమంలో ఇపుడు ఏకంగా 2,47,958 మంది భాగ­స్వాము­లయ్యారు. వంద గ్రామాలతో ప్రారంభమై 2,856 గ్రామాలకు విస్తరించింది.

రోజూ సగటున లక్షన్నర లీటర్ల పాలను సేకరిస్తోంది. 1,587 ఆర్బీకేల పరి­ధిలో 2,49,998 మంది పాడి రైతులు నిత్యం పాలు పో­స్తున్నారు. రెండేళ్లలో 5.40 కోట్ల లీటర్ల పాలను సేకరించగా పాడి రైతులకు రూ.232.26 కోట్లు చె­ల్లిం­చారు.

లీటర్‌పై రూ.4 అదనంగా లబ్ధి చేకూ­ర్చే­లా కృషి చేస్తామని హామీ ఇవ్వగా ప్రస్తుతం లీటర్‌ గేదె పాలకు రూ.15 –రూ.20 వరకు, ఆవు­పాలకు రూ.10 – రూ.12 వరకు అదనపు లాభం చేకూ­రుతోంది. అమూల్‌ రాకతో పోటీ పెరిగి ప్రైవేట్‌ డెయిరీలు సైతం అనివా­ర్యంగా సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా పాడి రైతులకు అదనంగా రూ.2,400 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది.

సంక్రాంతికి మిగతా జిల్లాల్లోనూ..
జగనన్న పాల వెల్లువ ద్వారా అమూల్‌ తర­ఫున ఉత్తరాంధ్రలో పాలు సేకరిస్తున్న బన­స్కాంత్‌ యూనియన్‌ ఐదోసారి పాలసేకరణ ధరను పెంచడంతో పాటు వెన్న, ఘనపదా­ర్థాల సేకరణ ధరలను కూడా పెంచింది.  ఇప్పటికే 17 జిల్లా­ల్లో పాలు సేకరిస్తున్నాం. సంక్రాంతి కల్లా మిగి­లిన జిల్లాలకు విస్తరించేలా కృషి చేస్తున్నా­ం.
– అహ్మద్‌బాబు, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement