ఏపీ: ఎన్నికల పర్యవేక్షణకు ఐజీ స్థాయి అధికారి నియామకం

IG Level Officer Appointed To Monitor Panchayat Elections - Sakshi

పంచాయతీ ఎన్నికలను పర్యవేక్షించనున్న ఐజీ సంజయ్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకి పోలీస్ శాఖ తరపున ప్రత్యేక అధికారిగా డాక్టర్ ఎన్.సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన ఎస్ఈసీ కార్యాలయానికి చేరుకుని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో సమావేశమయ్యారు. అనంతరం ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. నిష్పక్షపాత ఎన్నికల‌ నిర్వహణలో ఎన్నికల కమిషనర్‌కి ఐజీ సంజయ్ సహకరించనున్నారు. ఐజీ సంజయ్‌కి ఎన్నికల కమిషన్ కార్యాలయంలోనే ప్రత్యేక చాంబర్‌ని కూడా ఏర్పాటు చేశారు. చదవండి: ‘ఎస్‌ఈసీ అలా ఎందుకు చెప్పలేదు..?

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top