AP: High Power Committee For Solving Municipal Workers Issues - Sakshi
Sakshi News home page

AP: వాళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించండి: సీఎం జగన్‌

Jul 11 2022 4:30 PM | Updated on Jul 11 2022 6:06 PM

High Power Committee For Solving Municipal Workers Issues In AP - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గృహ నిర్మాణాలకు వనరుల విషయంలో దృష్టిసారించాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏపీలో గృహనిర్మాణశాఖపై తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఇవాళ(సోమవారం) సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా.. ఏపీలో మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి హై పవర్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం జగన్‌ తెలిపారు. సీఎస్‌ సమీర్‌ శర్మ నేతృత్వంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌లతో కూడిన హై పవర్‌ కమిటీని సమస్య పరిష్కారం కోసం నియమించినట్టు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: గృహ నిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్ష.. వనరులపై దృష్టిసారించాలని ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement