
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 7 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 82,746 మంది స్వామిని దర్శించుకున్నారు. 25,078 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.85 కోట్లు సమర్పించారు.
టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 4 గంటలు పడుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల చేసిన టిటిడి
- 22న ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్ల విడుదల.
- 22న మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల
- 23న ఉదయం 11 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు….
- 23న. ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా
- 23 మద్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
- 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
- 24 న మద్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల…
- https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.