గొర్ర గేదె మృతి  | Gorra Gede Died In Polavaram | Sakshi
Sakshi News home page

గొర్ర గేదె మృతి 

May 17 2022 11:40 PM | Updated on May 17 2022 11:40 PM

Gorra Gede Died In Polavaram - Sakshi

పోలవరం రూరల్‌: మండలంలోని ఎల్‌ఎన్‌డీపేట గ్రామ సమీపంలోని డేరా కొండ అటవీ ప్రాంతంలో గొర్రగేదె మృతిచెందింది. రెండు రోజుల క్రితం జీడిమామిడి పిక్కలు ఏరుకునేందుకు వెళ్లిన ముగ్గురు వ్యక్తుల పై దాడి చేసిన ఘటన విధితమే. ఈ దాడిలో కట్టవ రామాయమ్మ అక్కడికక్కడే మృతిచెందగా, పంది కొవ్వాడయ్య, పంది గంగాభవానీలకు గాయాలయ్యాయి.

వీరు చికిత్స పొందుతున్నారు. అటవీప్రాంతంలో పొదల నుంచి దుర్వాసన రావడంతో పశువుల కాపరులు గుర్తించి గొర్ర గేదె చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ సమాచారాన్ని అధికారులకు స్థానిక వీఆర్వో సమాచారం ఇచ్చారు. దాడి జరిగిన రోజునే గొర్ర గేదె మృతిచెంది ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఐతే గొర్ర గేదె చనిపోవడానికి గల కారణాలు తెలియరాలేద.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement